లక్షణాలు లేవని నిర్లక్ష్యం వద్దు..

బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హెల్త్ ప్రాబ్లం మాత్రమే కాదు, అదొక సోషల్ ఇష్యూ అని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ రీసెర్చ్లో తేలింది. సరైన అవగాహన లేకపోవడం, భయాలు, అపోహల వల్లే మహిళలు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ముందుగానే టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం. మొదట్లోనే గుర్తిస్తే క్యాన్సర్ని పూర్తిగా నయం చేయొచ్చు. దీనిపై ఉన్న అపోహలు తొలగించడానికి తెలుగుతో సహా 12 భాషల్లో ఒక యాప్ కూడా తీసుకొచ్చారని నిపుణులు తెలిపారు.



