పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని విద్యార్థిని సూసైడ్

TG: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో బీటెక్ విద్యార్థిని శ్రేయ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న యువతి, లెక్చరర్స్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొంది. గతంలో పరీక్ష హాల్లో సెల్ఫోన్ తీసుకెళ్లిన ఘటనతో పాటు, పరీక్షల సమయంలో తనపై పలు అనుమానాలతో కావాలనే నన్ను టార్గెట్ చేశారని పేర్కొంది. తండ్రి సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



