ప్రీపెయిడ్ కరెంట్.. కోరుట్లలో టీఆర్ఎస్ ధర్నా!

మొబైల్ రీఛార్జ్ లాగా.. ఇక కరెంట్ కూడా ముందస్తు చెల్లింపేనా? అంటూ.. కోరుట్ల బస్టాండ్ వద్ద తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేతలు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రీపెయిడ్ విద్యుత్ విధానం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన జరిగింది. టీఆర్ఎస్ కోరుట్ల ఇన్ఛార్జ్ డా. రఘు మాట్లాడుతూ – "స్మార్ట్ మీటర్లకు మేము వ్యతిరేకం కాదు. కానీ ముందుగారీచార్జ్ చేస్తేనే కరెంట్ వచ్చే విధానం ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది" అని ఖండించారు. ఇది పేద, గ్రామీణ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.



