‘మిషన్ శక్తిశాట్'కు ఎంపికైన బాలిక: అభినందించిన పవన్ కళ్యాణ్

AP: ప్రపంచంలోనే తొలి బాలికల లూనార్ క్యూబ్శాట్ మిషన్ 'మిషన్ శక్తిశాట్' కోసం భారతదేశ టాప్-20లో ఆంధ్రప్రదేశ్ నుంచి కందుల జెస్సీ ఎంపికైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి చంద్ర మిషన్ వరకు ఆమె చేసిన ప్రయాణం రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇస్రో ద్వారా దేశానికి సేవ చేయాలనే ఆమె కల సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నానని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.



