మహారాష్ట్రలో దారుణం.. మంటల్లో ముగ్గురు పసికందులు
మహారాష్ట్రలోని అమరావతి డిస్ట్రిక్ట్ ఉమెన్స్ హాస్పిటల్లో దారుణ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం 3:30 గం. సమయంలో NICUలో మంటలు చెలరేగాయి. వెంటిలేటర్ బ్లాస్ట్ అవ్వడంతో ముగ్గురు పసికందులు మృతి చెందారు. డాక్టర్లు, నర్సులు వెంటనే శిశువులను (పసికందులు) బయటకు తీసుకెళ్లారు. ఘటన సమయంలో 39 మంది నవజాత శిశువులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరుగురిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ప్రమాదంపై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



