ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండొద్దు: ప్రశాంత్ కిశోర్
బంకీపూర్ బై ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ఇది బీహార్ ప్రజల విజయం అని చెప్పారు. బీజేపీ మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తిని సీఎంగా చేయాలి, నేరస్తుడిని కాదనే సంకేతాన్ని ప్రజలు పంపారని అన్నారు. ప్రజలు ఎక్కడికీ వెళ్లవవసరం లేకుండా సౌకర్యాలు కల్పించాలని, బిహార్ మెరుగుపడాలని అన్నారు. కులమతాల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండకూడదని చెప్పారు.


