← Back to news

వరద విలయం.. వంద గ్రామాలకు రాకపోకలు బంద్

By DK· 2 Aug 2026
వరద విలయం.. వంద గ్రామాలకు రాకపోకలు బంద్

AP: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీలో నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని సుమారు 100 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమ జిల్లాలో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వరద విలయం.. వంద గ్రామాలకు రాకపోకలు బంద్
వరద విలయం.. వంద గ్రామాలకు రాకపోకలు బంద్

More in AP