← Back to news

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. తెలంగాణకు పెరుగుతున్న వరద

By Mahesh· 25 Jul 2026
మహారాష్ట్రలో భారీ వర్షాలు.. తెలంగాణకు పెరుగుతున్న వరద

TG: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ జిల్లాలోని సైకెడా ప్రాంతంలో వరద నీరు పంట పొలాలు, ఇళ్లను ముంచెత్తింది. అధికారులు జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జయక్వాడి ప్రాజెక్టు పూర్తిగా నిండితే తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీళ్లు చేరనున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం సుమారు 1.15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది.

More in News