NEET రీ-ఎగ్జామ్ డేట్ ఫిక్స్

NEET UG 2026 పేపర్ లీక్ వివాదంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ (NTA) కీలక నిర్ణయం తీసుకున్నాయి. రద్దయిన పరీక్షను జూన్ 21న (ఆదివారం) మళ్లీ నిర్వహించనున్నారు. పాత రిజిస్ట్రేషన్లే చెల్లుతాయని, విద్యార్థులు కొత్తగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు మళ్లీ ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఈ కేసును CBI విచారిస్తోంది.



