చర్చలకు న్యూట్రల్ స్టేజ్ అయితే ఓకే అంటున్న స్టూడెంట్స్

పేపర్ లీక్ లపై నిరసన తెలుపుతున్న CJP, విద్యార్థి సంఘాలతో చర్చలకు రెడీ అని కేంద్రం మళ్లీ ప్రకటించింది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా చర్చల్లో పాల్గొంటారని, కేంద్రం ఇప్పటి వరకూ నాలుగు ప్రతిపాదనలు పంపిందన్నారు. కానీ మంత్రుల ఇళ్లు లేదా ఆఫీసులలో కాకుండా జంతర్ మంతర్ లేదా తటస్థ ప్రదేశంలోనే చర్చలు జరగాలని CJP స్పష్టం చేసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.



