← Back to news

జూన్‌లో కొత్తగా 5606 వితంతు పెన్షన్లు

By SAIVAMSHI· 31 May 2026· ANDHRA PRADESH
జూన్‌లో కొత్తగా 5606 వితంతు పెన్షన్లు

AP: జూన్‌లో కొత్తగా 5606 మందికి స్పౌజ్‌ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేసినట్లు సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ పెన్షన్ల కోసం రూ.2.24 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్‌ 1న 62,34,445 మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2728 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్‌తో కలుపుకుని ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో రూ.65,886 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

More in AP