2028 నాటికి అమరావతి పనులు పూర్తి: చంద్రబాబు
AP: భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2028 కల్లా అమరావతి పనుల్లో మొదటి దశ పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రధాని మోదీతో పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేయిస్తానని ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలో 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.



