CJP నిరసనలపై సుప్రీంకోర్టు ట్విస్ట్

CJP విద్యార్థుల నిరసనలపై దిల్లీలో జరిగిన పోలీసు చర్యల విషయంలో సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించిందన్న వార్తలపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని, అయినా కోర్టు విచారణకు నిరాకరించినట్లు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. రిజిస్ట్రీని పరిశీలించగా ఈ కేసుకు సంబంధించి ఒక్క పేజీ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు.



