IMEI మార్చితే భారీ జరిమానా, జైలు

టెలికాం గుర్తింపులు, ముఖ్యంగా IMEI నంబర్ను ట్యాంపరింగ్ చేయడం నేరమని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ హెచ్చరించింది. IMEI మార్చిన మొబైల్ వాడినా, ఇలాంటి డివైజ్లను తయారు చేసినా 3 ఏళ్ల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా పడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్లతో SIM తీసుకోవడం, మన పేరుతో తీసుకున్న SIMను ఇతరులకు దుర్వినియోగానికి ఇవ్వడం కూడా నేరమే. మొబైల్ యాప్స్ లేదా వెబ్సైట్ల ద్వారా CLI, IMEI వంటి టెలికాం ఐడీలను మార్చడాన్నీ DoT నిషేధించింది.



