ఆశ్రమ పాఠశాలలో కరెంట్ షాక్తో విద్యార్థిని మృతి

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశిపురం గిరిజన ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని కరెంట్ షాక్తో మృతి చెందింది. చిట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఉదయం కిటికీపై ఆరేసిన బట్టలు తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. హాస్టల్ యాజమాన్యం, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బంధువులు, ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టారు.



