‘ట్రామా’పై నోరు విప్పుతున్న జెన్ జీ..

దేశంలో మానసిక గాయాలు (ట్రామా) ఒక నిశ్శబ్ద ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారుతున్నాయని రచయిత్రి నిషితా లాంబా తన డెక్కన్ హెరాల్డ్ కథనంలో విశ్లేషించారు. చాలామంది తమ అంతర్గత బాధను లోపలే దాచుకుంటారని, కానీ అది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సైకాలజిస్ట్ పల్లవి మోహన్ అభిప్రాయపడ్డారు. "ట్రామా అనేది కేవలం ఒక చేదు సంఘటన కాదు.. అది మన మనసు లోపల సృష్టించే అలజడి" అని వివరించారు. పాత తరాల వారు ఈ బాధలను దాచడానికి ప్రయత్నిస్తే, నేటి తరం యువత (Gen Z) దీనిపై ఓపెన్గా మాట్లాడుతోందని స్పష్టం చేశారు. ఈ అంతర్గత గాయాల నుండి కోలుకోవడానికి స్వీయ అంగీకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.



