జాతీయ గీతాన్ని మార్చాల్సిందే: ముఖేష్ ఖన్నా

దేశ జాతీయ గీతంగా ఉన్న 'జన గణ మన' స్థానంలో 'వందేమాతరం'ను తీసుకురావాలని ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ రాణిని పొగుడుతూ 'జన గణ మన' రాశారని, అది మన జాతీయ గీతం కాకూడదని ఆయన తెలిపారు. పూర్తిగా మనదైన 'వందేమాతరం'పై తాను ఏడు నిమిషాల ఐకానిక్ పాటను రికార్డ్ చేశానని, అది ఆరు నెలల్లో విడుదలవుతుందని చెప్పారు.



