← Back to news

భద్రత కరువు.. భయం నీడలో కాలనీలు

By dk· 4 Aug 2026· విశాఖపట్నం జిల్లా

AP: విశాఖపట్నం భీమునిపట్నం పరిధిలోని మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ, బక్కన్నపాలెం ప్రాంతాల్లో భద్రతా సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 5,200కుపైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో వీధి దీపాలు, CC కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలు, వాహనాల నుంచి పెట్రోల్ చోరీలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో మద్యం మత్తులో అల్లర్లు, రాష్ డ్రైవింగ్ కారణంగా మహిళలు, వృద్ధులు భయంతో బయటకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More in AP