రాజంపేటలో దారుణ హత్య
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శుద్ధగుంతల ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. చిలకాల పెంచలయ్య అనే వ్యక్తిని సాధుశెట్టి కత్తితో దాడి చేసి పొడిచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



