అయోధ్య రామమందిరం చోరీ కేసులో కొత్త ట్విస్ట్

అయోధ్య రామమందిరంలో చోరీ కేసు మరోసారి వార్తల్లోకొచ్చింది. గతంలో ట్రస్ట్లో పనిచేసిన మహిపాల్ సింగ్ SITకి మెయిల్ చేశారు. దీని గురించి యూట్యూబ్ ఛానల్ ‘టాప్ సీక్రెట్’ రిపోర్ట్ చేసింది. ఆలయ నిర్మాణం అంచనా వ్యయం రూ.800 కోట్లు అయితే, రూ.2,200 కోట్లు ఖర్చు చేశారని మహిపాల్ మెయిల్లో వివరించారు. ట్రస్ట్ తరఫున చంపత్ రాయ్ కొన్ని ఆస్తులు కొన్నారని కూడా రాశారు. చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ టిన్ను యాదవ్ ఆలయం నుంచి డబ్బు దొంగిలించి, ఆ ఫోటో తీసి చంపత్రాయ్కి పంపేవాడని ఆయన ఆరోపించారు.


