మైండ్ రీచార్జ్ కావాలంటే సైలెన్స్ బెస్ట్ !

రోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా గడపడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్, బోస్టన్ యూనివర్సిటీల ఉమ్మడి అధ్యయనం ప్రకారం.. కాసేపు ప్రశాంతంగా మౌనం పాటించడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఈ అలవాటు మెదడులోని వివిధ భాగాలను అనుసంధానించి, ఆలోచనా శక్తిని మెరుగుపరచడమే కాకుండా మానసిక దృఢత్వాన్ని ఇస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.



