తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్లో సెల్ఫోన్ కలకలం

AP: తిరుమల శ్రీవారి ఆలయ భద్రతా లోపం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ భక్తుడు ఏకంగా సెల్ఫోన్తో వైకుంఠం క్యూకాంప్లెక్స్లో రావడం తీవ్ర కలకలం రేపింది. కంపార్ట్మెంట్లో ఉన్న సమయంలో తన మొబైల్తో వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది. నిషేధిత ప్రాంతంలో వీడియో తీయడంతో తిరుమల విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది తీరుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



