← Back to news

డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్

By dk· 4 Aug 2026
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ డ్వాక్రా మహిళలకు భారీ ఊరటనిచ్చింది. CM ఆదేశాల మేరకు జూలై 1 నుంచి తీసుకున్న రుణాలపై ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఫీజులతో పాటు డాక్యుమెంటేషన్, లెడ్జర్ ఫోలియో, పాస్‌బుక్ అప్‌డేషన్, ఏసీహెచ్ స్టేట్‌మెంట్ ప్రింటింగ్, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలను రద్దు చేసింది. అలాగే రూ.5లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేటును 13శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. రాష్ట్రంలో ఈ బ్యాంకు పరిధిలో సుమారు 3 లక్షల డ్వాక్రా సంఘాలు, 30లక్షల మంది మహిళలు ఉండగా, ఈ నిర్ణయంతో వారికి ఆర్థిక ఉపశమనం లభించనుంది.

More in AP