నీటి గుంతలో పడి ముగ్గురు మృతి

AP: పొలంలో నల్లనేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు బాలురు నీటి గుంతలో పడి మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నారనాగేపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో డెడ్బాడీలను బయటకు తీశారు. ముగ్గురు బాలురు మృతితో నారనాగేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



