← Back to news

ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో న్యూ బిల్డింగ్స్

By Jagadish· 1d ago
ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో న్యూ బిల్డింగ్స్

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని ఏపీఎస్డబ్ల్యూ మహిళా డిగ్రీ కళాశాలలో కొత్తగా నిర్మించిన తరగతి గదులను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. PM-USHA పథకం కింద రూ.3.86 కోట్ల వ్యయంతో ఈ భవనాలు నిర్మించారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలల్లో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామకుమారి పాల్గొన్నారు.

More in Local