← Back to news

ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతుల ఫిర్యాదు

By డీకే· 18 Jun 2026· అమరావతి
ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతుల ఫిర్యాదు

AP: రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి రైతులు తమ భూముల విలువ నిర్ధారణలో జరుగుతున్న అన్యాయంపై గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ రైతులు ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. భూముల విలువకు సంబంధించి పరిహారం ఇచ్చేటప్పుడు భూముల విలువను తక్కువగా చూపుతూ, అప్పులు తెచ్చుకునేటప్పుడు మాత్రం ఎకరాకు రూ. కోట్లలో చూపిస్తున్నారని రైతులు అందులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన వరల్డ్ బ్యాంకు అధికారి ఒలీవర్ CRDAకు లేఖ పంపారు. ఉండవల్లి గ్రామంలో భూముల విలువ నిర్ధారణ, రక్షణ నిబంధనల ఉల్లంఘనలపై కొత్త ఫిర్యాదు వచ్చిందని దీనిపై పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.

More in AP