UPI వద్దే వద్దు.. బంకుల్లో మొదలైన నిరసన!

అక్టోబర్ 15 నుంచి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోళ్లలో 2,000 రూపాయలు దాటిన UPI చెల్లింపులపై డీలర్లు 5 రూపాయలు ఫ్లాట్ MDR చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీలర్ల అసోసియేషన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ మార్జిన్లు లీటరుకు 2 రూపాయల 40 పైసల నుంచి 3 రూపాయల 40 పైసలు మాత్రమే ఉంటాయనీ, MDR ఛార్జీ భారంగా మారుతుందని డీలర్లు చెబుతున్నారు. తమకు మినహాయింపు ఇవ్వకపోతే UPIని ఆపేసి, క్యాష్ మాత్రమే తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.



