← Back to news

ఆటో డ్రైవర్లకు మరాఠీ రూల్ ఎందుకు?

By Nani Garikina· 24 Aug 2026· Ndtv
ఆటో డ్రైవర్లకు మరాఠీ రూల్ ఎందుకు?

ముంబైలో ఆటో నడపాలంటే డ్రైవింగ్ వచ్చి ఉంటే సరిపోదా? “అవును, సరిపోదు” అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీలో కనీసం మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలట. RTO అధికారులు ప్రయాణికులతో మాట్లాడే పరిస్థితులపై 16 ప్రశ్నలు అడుగుతున్నారు. మరాఠీ రాకపోతే ముందుగా నెలరోజుల గడువు ఇస్తారు. అప్పటికీ అవసరమైన స్థాయిలో రాకపోతే బ్యాడ్జ్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ రూల్‌పై కొందరు డ్రైవర్లు నిరసనకు దిగారు. ప్రభుత్వం మాత్రం ప్రయాణికులతో లోకల్ లాంగ్వేజ్‌లో ఈజీగా మాట్లాడేందుకే ఈ రూల్ అంటోంది.

ఆటో డ్రైవర్లకు మరాఠీ రూల్ ఎందుకు?

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.