← Back to news

కృష్ణలంక ఘటనపై ప్రభుత్వం సీరియస్

By డీకే· 18 Jun 2026· Dishadaily· విజయవాడ
కృష్ణలంక ఘటనపై ప్రభుత్వం సీరియస్

విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం APలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నెలరోజుల క్రితం సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా పోయారు. సాయికృష్ణ గురించి పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలు బయటకు చెప్పలేదు. జూన్ 29లోపు సాయికృష్ణను తమ ఎదుట హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశాలతో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీని ఛేదించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

More in AP