శ్రీశైలం ప్రాజెక్టులోకి 100 టీఎంసీలు

AP: ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి కృష్ణా నది ప్రవాహం భారీగా వస్తోంది. ఉదయం జలాశయం నీటిమట్టం 858.70 అడుగులుగా, నీటి నిల్వ 101.9210 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,53,543 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 924 క్యూసెక్కులుగా ఉంది. కర్ణాటక నుంచి దిగువకు నీటి విడుదల పెరుగుతుండటంతో జూరాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.



