పచ్చదనం కోసం అందరూ కదలాలి: ఎస్పీ జానకి షర్మిల

TG: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామంలో ఎస్పీ మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 16.03 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంలో ఇప్పటికే 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు ఆమె తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలు వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని కోరారు.





