సోనమ్ వాంగ్చుక్ ప్రాణాలు పోతున్నా.. గవర్నమెంట్ సైలెంట్!

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన కండరాల క్షీణతతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. దీక్ష ఆపాలని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కేతో పాటు అందరూ రిక్వెస్ట్ చేయగా, "నన్ను దీక్ష ఆపమని అడగొద్దు, చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి" అంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సోనమ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకు సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు.



