క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్యా రహానే

భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె అంతర్జాతీయ క్రికెట్తో పాటు IPLకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 13 ఏళ్లుగా క్రికెట్ ఆడిన అతను, ఆట నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని సోషల్ మీడియాలో చెప్పాడు. 2023 తర్వాత అతను ఇండియా తరఫున ఆడలేదు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన BCCI, MCA, కోచ్లు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్కు దూరం అయినా ఈ ఆటతో తన ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతుందని చెప్పాడు.



