జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీపై బిగ్ అప్డేట్

TG: సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పారిశ్రామికవాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. నీటి సరఫరా పనులకు టెండర్లు పూర్తయ్యాయని, విద్యుత్ పనులు కూడా గడువులోగా పూర్తవుతాయని తెలిపారు.



