గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. అడ్డొచ్చాడని దాడి

AP: కడప జిల్లా వల్లూరులో క్షుద్రపూజలకు అడ్డుపడుతున్నాడనే కారణంతో బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పులిచెర్లకు చెందిన విజయ్కుమార్, చిత్తూరుకు చెందిన హేమంత్, సుబ్రహ్మణ్యం గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేసేందుకు ఓ బాలికను డబ్బు ఆశచూపి నగ్న పూజలకు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పూజలకు అడ్డుగా ఉన్న నాగసాయి ప్రణవ్ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమై వేటకత్తితో దాడిచేశారన్నారు.



