భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతుల ఫైట్
భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలోని కిసాన్ ఘాట్ వైపు కాలినడకన వెళ్తున్న పంజాబ్ రైతులను శంభు బోర్డర్ వద్ద పోలీసులు బారికేడ్లతో బ్లాక్ చేశారు. దీంతో రైతులు అక్కడే నిరసన చేపట్టారు. అమెరికా నుంచి సబ్సిడీ పొందిన అగ్రికల్చర్, డెయిరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వస్తే 8 కోట్ల రైతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. ట్రేడ్ ఒప్పంద పత్రాలను వెంటనే పబ్లిక్ చేయాలని, తమతో మాట్లాడకుండా ఏ డీల్ కూడా సైన్ చేయొద్దని డిమాండ్ చేశారు.



