రాత్రి భోజనం తర్వాత పండ్లు తింటున్నారా?

రాత్రి భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయని న్యూట్రిషియన్లు అంటున్నారు. కడుపులో ఆమ్లత్వం వల్ల పండ్లు పులియకపోయినా, ఆలస్యంగా జీర్ణమవ్వడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(IBS), ఎసిడిటీ, అలసట, బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రి భోజనం తర్వాత పండ్లకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. పండ్లను ఉదయం పూట ఖాళీ కడుపుతో లేదా భోజనానికి మధ్య సమయంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.



