SC విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు: మంత్రి డోలా

AP: SC విద్యార్థులకు JEE, NEET పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు అందించనున్నట్లు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఏర్పాటు చేయనున్న జేఈఈ, నీట్ ఎక్స్లెన్స్ సెంటర్లలో అదనపు భవనాల నిర్మాణం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అదనపు భవనాలతో పాటు అంతర్గత రహదారులు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టు, ఖోఖో కోర్టు, మల్టీపర్పస్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.



