IIT, NIT తరహాలో మౌలిక వసతులు: లోకేశ్

AP: రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలోని JNTU ఇంజినీరింగ్ కళాశాలలో నూతన హాస్టళ్లను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. IITలు, NITల తరహాలో ఆధునిక మౌలిక వసతులు, ప్రయోగశాలలు, నైపుణ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.



