← Back to news

లంక గ్రామాలకు రాకపోకలు బంద్

By DK· 31 Jul 2026· కోనసీమ జిల్లా
లంక గ్రామాలకు రాకపోకలు బంద్

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద వరద ఉధృతికి తాత్కాలిక మట్టి గట్టు కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపాలెం, గంటిపెదపూడి లంక గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యార్థులు, రైతులు, అత్యవసర అవసరాల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు తగ్గే వరకు నాటు పడవలే ఏకైక రవాణా మార్గంగా మారాయి.

More in AP