హత్య చేసి మిస్సింగ్ డ్రామాతో తప్పించుకునే ప్లాన్

TG: తండ్రిని హత్యచేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరించిన ఘటనలో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం పరిధిలో జరిగిన ఈ కేసులో భీమిని ఉదయ్(23) నిందితుడిగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రి లక్ష్మణ్కు ఇష్టం లేకపోవడంతో తరచూ కుమారుడు, కోడలిని దూషిస్తూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారం ఉదయ్ తండ్రిని బైక్పై గొల్లవాగు ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేసినట్లు విచారణలో లేలింది. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.



