← Back to news

హత్య చేసి మిస్సింగ్ డ్రామాతో తప్పించుకునే ప్లాన్

By dk· 13 Aug 2026· మంచిర్యాల జిల్లా
హత్య చేసి మిస్సింగ్ డ్రామాతో తప్పించుకునే ప్లాన్

TG: తండ్రిని హత్యచేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరించిన ఘటనలో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం పరిధిలో జరిగిన ఈ కేసులో భీమిని ఉదయ్‌(23) నిందితుడిగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రి లక్ష్మణ్‌కు ఇష్టం లేకపోవడంతో తరచూ కుమారుడు, కోడలిని దూషిస్తూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారం ఉదయ్‌ తండ్రిని బైక్‌పై గొల్లవాగు ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేసినట్లు విచారణలో లేలింది. మృతదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.