హిసార్ కోర్టు హత్య..హిమాంశు సోనిపట్ బాధ్యత

హర్యానాలోని హిసార్ కోర్టు వద్ద గ్యాంగ్స్టర్ వినోద్ పనూ అలియాస్ కానా నిన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య తామే చేశామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన హిమాంశు సోనిపట్ సోషల్ మీడియా పోస్ట్లో ప్రకటించాడు. రోహిత్ సోనిపట్, అనిల్ పండిట్, హర్మాన్ సంధూ ఆదేశాల మేరకు ఈ దాడి చేసినట్లు తెలిపాడు. పోలీసులు ఈ పోస్ట్ ప్రామాణికతపై దర్యాప్తు చేస్తున్నారు.



