మూగబోయిన ఊరిలో.. మువ్వన్నెల జెండా చేసిన చప్పుడు!

జమ్మూకశ్మీర్లో 'సైలెంట్ విలేజ్' గా పిలిచే ధడ్కై అనే గ్రామంలో రేష్మా బీబీ, పర్వీన్ కౌసర్, సైరా ఖతూన్ అనే ముగ్గురు దివ్యాంగ అక్కాచెల్లెళ్లు ఉన్నారు. దేశభక్తితో తమ ఊరిలో ప్రతి ఇంటిపై జెండా ఎగరాలని వారు అనుకున్నారు. 'జెండాలు కుట్టేందుకు వస్త్రం తెకపోతే అన్నం తినం' అని తండ్రిని అడిగి వస్త్రం తెప్పించుకున్నారు. ఐదు రోజుల పాటు కష్టపడి 150కి పైగా త్రివర్ణ పతాకాలను స్వయంగా కుట్టి, ఊరంతా పంచారు. దాంతో ఆ నిశ్శబ్ద గ్రామం ఇప్పుడు మన జాతీయ జెండాలతో కళకళలాడుతోంది.



