← Back to news

ప్రభుత్వ ప్రకటనపై జూడాల అసంతృప్తి

By విశీ· 19 Aug 2026
ప్రభుత్వ ప్రకటనపై జూడాల అసంతృప్తి

AP: ఇంటర్నీలకు 5 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 3 శాతం పెంచుతామంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనపై జూనియర్ డాకర్ట్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 15 శాతం స్లైపెండ్ పెంచాలని కోరుతూ కొన్ని రోజులుగా రాష్ట్రంలో జూడాలు ఆందోళన చేస్తున్నారు. విధులకు వెళ్లకుండా సమ్మె చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఈ ప్రకటన ఇచ్చింది. కానీ దాని వాళ్లు అంగీకరించడం లేదు. పాత ప్రకటనే ప్రభుత్వం కొత్తగా చేసిందని, తమ సమ్మె కొనసాగుతుందని జూడాల జేఏసీ తెలిపింది.

More in AP