← Back to news

విజయనగరంలో పిడుగుపాటు.. రెండు పాడిగేదెలు మృతి!

By Jagadish· 1h ago
విజయనగరంలో పిడుగుపాటు.. రెండు పాడిగేదెలు మృతి!

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చింతగుంపల్లి పంచాయతీ వెలుతుర్వారిపల్లిలో కౌలు రైతు బత్తి అప్పయ్యకు చెందిన రెండు పాడిగేదెలు పిడుగుపాటుకు గురయ్యాయి. అక్కడికక్కడే రెండు గేదెలు మృతి చెందాయి. దీంతో రైతుకు సుమారు రూ.1.80 లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరుతున్నారు. పిడుగుపాటుతో రైతు కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది.

More in Politics