కారు దూసుకెళ్లి స్తంభానికి ఢీ.. మెడికో స్పాట్డెడ్

AP: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో వైద్య విద్యార్థి అల్లం జయసూర్య (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు కాకినాడ నుంచి అమలాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



