తిరంగా యాత్రలో అస్వస్థతకు గురైన చిన్నారులు

మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లా చిత్రంగి వద్ద తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు చిత్రంగి మార్కెట్ చేరుకోవడానికి సుమారు 6 కి.మీ. నడిచారు. రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి రాధాసింగ్ కోసం గంటసేపు వెయిట్ చేశారు. ఆ తర్వాత మరో 1.5 కి.మీ. నడిచారు. దీంతో 12 మంది కళ్లు తిరిగి కిందపడ్డారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఏర్పాట్లలో నిర్లక్ష్యం లేదని, మార్గంలో చాలా చోట్ల నీరు అందించామని చెప్పారు.


