← Back to news

రూ.వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల కేసులో కీలక సూత్రధారి అరెస్టు?

By విశీ· 4 Aug 2026
రూ.వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల కేసులో కీలక సూత్రధారి అరెస్టు?

TG: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాలకు చెందిన వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం స్పెషల్‌ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల కేసుల్లో ఇతనే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. ఈ కేసుల్లో గతంలో అరెస్టయిన నిందితులను విచారిస్తుండగా ఇతని పేరు బయటికొచ్చింది. నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్‌లో అతణ్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.