రూ.వెయ్యి కోట్ల సైబర్ మోసాల కేసులో కీలక సూత్రధారి అరెస్టు?

TG: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాలకు చెందిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం స్పెషల్ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.వెయ్యి కోట్ల సైబర్ మోసాల కేసుల్లో ఇతనే మాస్టర్ మైండ్ అని తెలుస్తోంది. ఈ కేసుల్లో గతంలో అరెస్టయిన నిందితులను విచారిస్తుండగా ఇతని పేరు బయటికొచ్చింది. నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్లో అతణ్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



