సంప్రదాయ కళలకు ఊతం: పవన్ కల్యాణ్

AP: సంప్రదాయ హస్త కళాకారులకు అండగా నిలిచేందుకు రాష్ట్రంలో క్రాఫ్ట్ ఉడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. సచివాలయంలో క్రాఫ్ట్ ఉడ్ బ్యాంకుల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. కళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకు అందించి, వారి ఉత్పత్తి ఖర్చును తగ్గించడమే లక్ష్యమన్నారు. తొలిదశలో కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బిలి, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి ప్రాంతాల్లో ఉడ్ బ్యాంకులు అందుబాటులోకి రానున్నాయి. కళాకారులకు నిరంతరం కలప అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.



