← Back to news

ప్రతి భారతీయుడూ గర్వపడాలి: రాహుల్ గాంధీ

By విశీ· 29 Jul 2026· X

దిల్లీలో జరిగిన CJP ఉద్యమం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ దేశ విద్యార్థులు వీధుల్లో చేసిన పని చూసి చాలా ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నానని అన్నారు. పబ్లిక్‌ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఈ దేశ యువత ఎక్స్‌ప్రెషన్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని గౌరవించాలన్నారు. ఈ దేశ యువత చేసిన పనికి ప్రతి భారతీయుడూ గర్వపడాలన్నారు.

More in Politics